
ఈ అపూర్వ ఘట్టానికి శనివారంతో ఏడాది పూర్తవుతోంది. రాజధానిలో శాశ్వత భవనాల నిర్మాణానికి ముందే ఇక్కడి నుంచి పాలన సాగించాలన్న ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుగుణంగా వెలగపూడి వద్ద 45 ఎకరాల్లో తాత్కాలిక సచివాలయం నిర్మాణం చేపట్టాలని భావించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న శంకుస్థాపన చేశారు. 201 కోట్లతో చేపట్టిన ఈ భవనాల నిర్మాణాన్ని కేవలం 8 నెలల్లోనే పూర్తిచేశారు. ఇటీవల ఈ భవనాలను ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభించడంతో, ప్రస్తుతం ఏపీ పాలన ఇక్కడి నుంచే కొనసాగుతోంది. ఈ నెల 28న అమరావతిలోని ఆర్థిక, పరిపాలన భవనాలకు కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబరు 2018 నాటికి అమరావతి తొలి దశ నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది.
ఇక రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్లాట్ల పంపిణీ మొదలు పెట్టింది. ఇప్పటికే పది గ్రామాల రైతులకు లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తూ రాజధాని నిర్మాణం కారణంగా ఉపాధి కోల్పోయిన భూమి లేని నిరుపేదలకు, నిరుద్యోగులకు ప్రభుత్వం ప్రతి నెలా 2,500 పింఛను ఇస్తోంది. మొత్తం 29 గ్రామాల్లోని 19,189 మందికి పింఛను అందుతోంది. మరోవైపు రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రదేశాన్ని పర్యాటక స్థలంగా మార్చడంతో నిత్యం ఎంతో మంది వచ్చి ఆయా ప్రాంతాలను సందర్శిస్తున్నారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…