
రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ భవనాల ఆకృతుల రూపకల్పనలో రాజమౌళి సలహాలు, సూచనలు తీసుకోవాలని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) అధికారులను చంద్రబాబు ఆదేశించారు. దీంతో బుధవారం మంత్రి పి.నారాయణ ఆధ్వర్యంలో సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ సహా ఇతర అధికారుల బృందం రాజమౌళితో హైదరాబాద్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శాసనసభ, హైకోర్టుల నమూనాలపై సలహాలు ఇవ్వాలని కోరారు.
దాదాపు గంటపాటు రాజమౌళితో సమావేశమై రాజధానిలో నిర్మించనున్న భవనాలపై చర్చించారు. తెలుగు రాష్ట్రాల చరిత్ర, సంస్కృతులు, మూడు ప్రాంతాల్లోని రాజుల చరిత్రపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా రాజమౌళి మాట్లాడుతూ అమరావతి నిర్మాణంలో తన వంతు సహకారం అందిస్తానని, తగిన సూచనలు, సలహాలు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న “బాహుబలి-2” పూర్తయిన తర్వాత ఇందుకోసం తగిన సమయం కేటాయిస్తానని, తనను కలిసిన బృందానికి హామీ ఇచ్చినట్టు తెలిసింది.
రాజకీయాలలో ఎల్లప్పుడూ శత్రుత్వమే కాదు మర్యాదలు, సత్ సాంప్రదాయాలు, ఆనవాయితీలు కూడా పాటించడం అవసరం. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి,…
Social media was buzzing recently with news that Ranveer Singh bought the rights to Amish…