
రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం అంచనా వేసిన భూములలో తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామ పరిధిలోని 660.83 ఎకరాల విస్తీర్ణం కోసం 904 మంది యాజమానుల పేర్లు తెలుపుతూ ఈ నోటీసులు విడుదల చేసింది. ఇక ఈ నోటిఫికేషన్ ను తీవ్రంగా వ్యతిరేకించిన వైకాపా, ఏపీ సర్కారు కోర్టు ధిక్కరణ నేరానికి పాల్పడుతోందని ఆరోపణలు చేసింది. అలాగే చంద్రబాబు ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ కేసును కూడా వేయనున్నామని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు.
అయితే ఈ సారి పెనుమాకలో పర్యటించడానికి ముందుగా ఎవరు వస్తారు? ఇప్పటికే పవన్ ఓ సారి బహిరంగ సమావేశం కూడా ఏర్పాటు చేసి రైతులతో భేటీ అయ్యారు. అలాగే జగన్ కూడా వివిధ సందర్భాలలో ఈ గ్రామం గుండా వెళ్ళినవారే. అయినప్పటికీ, రైతుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో, మళ్ళీ ఈ నేతలు వచ్చినా ప్రజలు నమ్మకాలు పెట్టుకుంటారా? పవన్ ఏమో తన తాజా సినిమా షెడ్యూల్ తో బిజీగా ఉండగా, జగన్ ఏమో తన కేసుల వ్యవహారంతో మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో ఈ సారి పెనుమాకకు ఎవరూ రాకపోవచ్చని టాక్.
Delhi Capitals kept their IPL 2026 playoff hopes alive with a thrilling 3 wicket victory…
The YSRCP’s current obsession with where the CM and Deputy CM spend their weekends is…