
ఆ తర్వాత ‘ఎవడు’ సినిమాతో రామ్ చరణ్ కు కమర్షియల్ హిట్ అందించిన వంశీ పైడిపల్లి, ఈ ఏడాది “ఊపిరి” సినిమా ద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. దీంతో పాటు ప్రిన్స్ మహేష్ బాబును దర్శకత్వం వహించే గోల్డెన్ ఛాన్స్ కూడా కొట్టేసాడు వంశీ. పివిపి నిర్మాణంలో ప్రిన్స్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఉన్న ప్రాజెక్ట్ గురించి ఇప్పటికే ఓ అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఎప్పుడు ప్రారంభం అవుతుందో అనే దానిపై మాత్రం వచ్చే ఏడాదే స్పష్టత రానుంది.
అలాంటి వంశీ పైడిపల్లి ట్విట్టర్ లోకి అడుగు పెట్టాడు. అలా ఎంట్రీ ఇవ్వడంతో మొదటగా ఎవరిని ఫాలో అయ్యారో తెలుసా..? మరెవరో కాదు… తన తదుపరి సినిమాలో హీరోగా నటించబోతున్న ప్రిన్స్ మహేష్ బాబుని. అలా వంశీ పైడిపల్లి ఫాలో అయ్యే వారిలో మొదటి వ్యక్తిగా ప్రిన్స్ నమోదు కాగా, ఆ క్రమంలోనే సమంత, దేవీశ్రీప్రసాద్, నాగార్జున, రాజమౌళి, రానా, జూనియర్ ఎన్టీఆర్, కాజల్, తమన్నా, హరీష్ శంకర్, నాని తదితరులను చేర్చుకున్నాడు.
రాజకీయాలలో ఎల్లప్పుడూ శత్రుత్వమే కాదు మర్యాదలు, సత్ సాంప్రదాయాలు, ఆనవాయితీలు కూడా పాటించడం అవసరం. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి,…
Social media was buzzing recently with news that Ranveer Singh bought the rights to Amish…