
ఇండియన్ పాలిటిక్స్లో ఇలాంటి రోజు చాలా అరుదు. అధికారంలో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక్కేసారి కుర్చీ మాత్రమే కాదు, తమ ఎమ్మెల్యే సీట్లను కూడా కోల్పోవడం పెద్ద షాక్గా మారింది. ఇది కేవలం ఓటమి కాదు, పూర్తి రిజెక్షన్ అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
తమిళనాడులో ఎం. కె. స్టాలిన్ పరిస్థితి ఇదే చెబుతోంది. చెన్నైలోని కొత్తలూరు నుంచి పోటీ చేసి, 40 ఏళ్లలో మొదటిసారి ఓడిపోవడం చిన్న విషయం కాదు. 8 వేలకుపైగా ఓట్ల తేడా అంటే, ప్రజలు స్పష్టంగా ‘ఇంకా వద్దు’ అన్నట్టే.
బెంగాల్లో మమతా బెనర్జీ కథ ఇంకా గట్టిగా ఉంది. భవానీపూర్లో ఆమె ప్రచారం మొదటి నుంచి తడబడింది. చివరికి ఫలితం కూడా అదే చూపించింది, సీఎం అయిన ఆమెకే తన సీటు కాపాడుకోలేని పరిస్థితి రావడం పెద్ద సందేశమే.
ఇద్దరి కేసుల్లోనూ కామన్ పాయింట్ ఒక్కటే. యాంటీ ఇన్కంబెన్సీ స్థాయి చాలా ఎక్కువైంది. ప్రభుత్వాలపై ఉన్న అసంతృప్తి చివరకు నేరుగా సీఎం మీదే పడింది. ఈ లెవెల్లో ఓటర్లు స్పందిస్తే, అది సాధారణ ఓటింగ్ కాదు, క్లియర్ వార్నింగ్.
ఇక కేరళలో పినరయి విజయన్ పరిస్థితి తేడాగా ఉన్నా, సిగ్నల్ మాత్రం అదే. గెలిచినా చాలా తక్కువ మార్జిన్తో బయటపడటం, అక్కడ కూడా అసంతృప్తి పెరిగిందనే సంకేతం ఇస్తోంది.
మొత్తానికి ఈ ఫలితాలు ఒక పెద్ద మెసేజ్ ఇస్తున్నాయి. కుర్చీలో కూర్చున్నంత మాత్రాన గెలుపు గ్యారెంటీ కాదు. ప్రజలు ఒకసారి డిసైడ్ అయితే, సీఎం అయినా, సీనియర్ అయినా తేడా చూడరు. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే… ఈ షాక్ తర్వాత మిగతా రాష్ట్రాల్లో ఉన్న సీఎంలు తమ స్ట్రాటజీ మార్చుకుంటారా లేదా ఇదే ట్రెండ్ కొనసాగుతుందా?
“భగవంత్ కేసరి” చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నప్పుడు, ఆ రీమేక్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ అనిల్ రావిపూడికి వచ్చింది.…
తమిళనాడులో గాలి తిప్పేశాడనే ఇమేజ్ వచ్చేసింది. కానీ ఫలితాల దగ్గరికి వచ్చేసరికి అసలు నిజం బయటపడింది. 108 సీట్లు పెద్ద…