ఏపీలో పార్టీ ఫిరాయింపుల పర్వం కొనసాగుతున్న నేపధ్యంలో గతంలో తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉన్న ముఖ్య నేతలందరూ ఒక్కొక్కరుగా అధికార పార్టీ పక్షాన చేరుతున్నారు. అయితే ఈ క్రమంలో రాజకీయ రంగంలో ‘ఐరన్ లెగ్’లుగా భావించిన మైసూరారెడ్డి వంటి మరికొంతమంది నేతలు కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ ఊపందుకుంది. అయితే దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ పడుతున్నాయి.
ఇలాంటి వారిని టిడిపిపై ప్రయోగించి తానూ అనుకున్న కార్యక్రమాన్ని జగన్ పూర్తి చేయాలని భావిస్తున్నారని, బహుశా మరికొద్ది రోజుల్లో రోజా పేరు కూడా వినిపించినా ఆశ్చర్యం లేదని నెటిజన్లు కౌంటర్ వేస్తున్నారు. అయితే రోజా, కొడాలి నాని వంటి వారిని పార్టీలోకి చేర్చుకునేది లేదని టిడిపి నేతలు ఇప్పటికే వ్యాఖ్యానించారు. మరి మైసూరా విషయంలో టిడిపి అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో గానీ, ‘ఐరన్ లెగ్’లుగా భావించిన వారిని మాత్రం చేర్చుకోవద్దని సూచనలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, వైకాపాలోని 30 మంది వరకూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని శిల్పా చక్రపాణి రెడ్డి వ్యాఖ్యానించారు. తాము ఎవరికీ మంత్రి పదవులను ఆశగా చూపలేదని, వైకాపా పూర్తిగా ఖాళీ అయ్యే రోజు త్వరలోనే రానుందని అన్నారు.



