వివాదాస్పద బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన తలైవి షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రం కోసం నటి 10 రోజులు షూట్ చేయనుంది. ఆమె కోసం హైదరాబాద్ పోలీసులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుశాంత్ సింగ్ రాజపుట్ కేసు సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల ఆమెకు చాలా మంది శత్రువులు తయారయ్యారు.
దానితో కేంద్రం ప్రభుత్వం ఆమెకు వై ప్లస్ సెక్యూరిటీ కూడా ఇచ్చింది. వై-కేటగిరి భద్రతలో ఉన్న కంగనా పర్యటనను అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు. ఆమెకు వై-కేటగిరి భద్రత ఉన్నందున… రాష్ట్ర పోలీసుల తరుపున భద్రత ఏర్పాట్లు చేశామని, ఆమె సెక్యూరిటీతో టచ్ లో ఉన్నామని తెలంగాణ పోలీసులు ప్రకటించారు.
ఇది ఇలా ఉండగా… తలైవి ఒక బయోపిక్, ఇది జయలలిత అతిపెద్ద తారలలో ఒకరిగా ఎదగడానికి చేసిన ప్రయాణాన్ని వివరిస్తుంది… అలాగే ఆమె మొదటిసారి తమిళనాడు ముఖ్యమంత్రి కావడంతో ముగుస్తుంది. అయితే సినిమాలో జయలలిత లైఫ్ లోని తరువాతి రోజులు సినిమాలో చూపించబడవు.
ఈ చిత్రం జూన్ 26 న విడుదల కావాల్సి ఉంది, కాని కరోనా వైరస్ మహమ్మారి కారణంగా, విడుదల తేదీపై స్పష్టత లేదు. అరవింద్ స్వామి ఎంజిఆర్ పాత్రలో నటించబోయే చిత్రానికి ఎఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం యొక్క ప్రారంభ ప్రమోషన్లు ప్రతికూల స్పందనను పొందాయి.




