నవంబర్ 2 నుండి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహా పాదయాత్రకు సన్నధం ఆవతున్నారు. 6 నెలల పాటు 3600 కిలోమీటర్ల దూరం నడవాలని ఆయన ప్రణాళిక. ఈ ప్రక్రియలో ఆయన 120 నియోజకవర్గాలను కవర్ చెయ్యబోతున్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ కూడా ప్రజా క్షేత్రంలోకి రానున్నారని సమాచారం.
“మాకు ఆయన యాత్ర మీద ఎలాంటి సమాచారం లేదు. ఎలాంటి అనుమానము లేదు. ఆయన రాజకీయాల్లోకి రావాలని అనుకున్నపుడు నిరంతరం ప్రజల్లో ఉండాలి. వాళ్ల సమస్యల మీద పోరాడి ప్రభుత్వాన్ని నిలడీయాలి. ఇలాంటి వైఖరితో ఆయనను ప్రజలు నమ్ముతారని నేనైతే అనుకోవడం లేదు,” అని రోజా అన్నారు.
అదే సమయంలో పవన్ కల్యాణ్ కూడా యాత్ర చేస్తే జగన్ మోహన్ రెడీ యాత్రకు కావాల్సినంత మీడియా కవరేజ్ రాదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిప్రాయం. జగన్ పాదయాత్రను నీరుగార్చడానికే తెదేపా పవన్ కల్యాణ్ ను ప్రోత్సహించి ఈ యాత్ర చేయిస్తుందని వాళ్ల అనుమానం.



