కాకతాళీయమో లేక జగన్ చెప్పే దేవుడి విధి రాతో గానీ, ఏపీ సీఎం చేస్తోన్న పనులు ప్రతిపక్ష నేత నారా లోకేష్ కు వరంలా మారుతున్నాయి. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్ రెడ్డి జెండా ఊపిన తర్వాత వాహనాల పరిస్థితి ఏమిటన్నది ఓ షార్ట్ వీడియో రూపొందించి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు నారా లోకేష్.
అంబులెన్సులు ప్రారంభించి విజయవాడలోని మహాత్మా గాంధీ రోడ్డులో వరుసగా నిలుపగా, జగన్ రెడ్డి జెండా ఊపిన తర్వాత స్టార్ట్ అయిన అంబులెన్సులు కొద్దిసేపటికే ఒక దానికొకటి ఢీకొని హాట్ టాపిక్ అయిన వైనం తెలిసిందే. సహజంగా ఎవరికైనా ఆక్సిడెంట్ అయితే అంబులెన్సులో తీసుకెళ్లారు, కానీ ఆ రోజు అంబులెన్సుకే ఆక్సిడెంట్ అవ్వడం వైరల్ అయ్యింది.
అలాగే రేషన్ బండ్లు కూడా! ఇంటింటికి వెళ్లి రేషన్ అందివ్వాల్సిన వాహనాలను ఏ విధంగా వినియోగిస్తున్నారో చాటిచెప్పే ప్రయత్నం ఈ వీడియో ద్వారా లోకేష్ చేసారు. సర్వీస్ ఆటోల మాదిరి ఈ రేషన్ వాహనాలలో జనాలను ఎక్కించుకోవడం కూడా ఇప్పటికే తెలిసిన విషయం కాగా, వాటన్నింటిని క్రోడీకరించి, ఓ దగ్గరికి తీసుకువచ్చారు లోకేష్.
ఇక తాజాగా ప్రారంభించిన ‘తల్లి – బిడ్ద’ వాహనాలకు ఏమవుతుందో? అని క్వశ్చన్ మార్క్ వేసి వదిలేయగా, ఆ కాసేపటికే సోషల్ మీడియాలో ‘తల్లి – బిడ్డ’ వాహనం ఒకటి తలక్రిందులుగా పడింది. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో సందడి చేసాయి. దీంతో నారా లోకేష్ చేసిన “జగన్ రెడ్డి జెండా ఊపితే అంతే” అన్న నినాదం వినోదభరితంగా మారింది.
కడుపుతో ఉన్న ఆడబిడ్డలను ఇంత జాగ్రత్తతోనే తీసుకువెళ్తారా? అన్న ప్రశ్న ఉత్పన్నం అయ్యింది. అంతేకాదు, జగన్ రెడ్డి వాహనాలు సరిగ్గానే ఉన్నాయి, జనాలే తల్లక్రిందులుగా నడుస్తున్నారంటూ నెటిజన్లు చేస్తోన్న ఎటకారపు కామెంట్స్, పోస్ట్ లకు సోషల్ మీడియా వేదిక అవుతోంది.
.@ysjagan ఊపితే…అంతే pic.twitter.com/eJld6YypAX
— Lokesh Nara (@naralokesh) April 1, 2022



