గవర్నర్ గా కృష్ణం రాజు… దాదాపుగా కంఫర్మ్

Krishnam Raju as Andhra pradesh governorసీనియర్ నటుడు కృష్ణం రాజు ను తమిళనాడు గవర్నర్‌గా పంపవచ్చని పుకార్లు వ్యాపించాయి. అక్టోబర్ 2017 లో గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన బన్వారిలాల్ పురోహిత్ స్థానంలో కృష్ణంరాజు నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. కృష్ణం రాజుకు తెలుగు రాష్ట్రాల్లో రెండింటిలోనూ ఏదైనా కీలకమైన పదవి కావాలని కోరుకున్నారు, కాని బిజెపి హైకమాండ్ అతన్ని తమిళనాడుకు పంపాలని ఆలోచిస్తుందట.

కృష్ణం రాజు దీర్ఘకాలంగా బిజెపి నాయకుడుగా ఉన్నారు. కృష్ణంరాజు గతంలో రెండుసార్లు బిజెపి ఎంపిగా గెలిచారు. 2000 నుండి 2004 వరకు బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశారు. అతను కాషాయ పార్టీని వదిలి 2009 లో పిఆర్పిలో చేరారు.

ADVERTISEMENT

2014 ఎన్నికలకు ముందు బిజెపిలో తిరిగి చేరారు. సంకీర్ణ పార్టీ ద్వారా బిజెపి తమిళనాడుపై దృష్టి సారించడంతో, ఈ వేసవిలో ఎన్నికలకు వెళ్లేటప్పుడు రాష్ట్రంలో గవర్నర్‌గా తమ విధేయుడి అవసరం ఉందని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే కృష్ణం రాజు కు పదవి గారంటీ అంటున్నారు.

కృష్ణం రాజు కు పదవి ఇస్తే దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానుల సపోర్ట్ కూడా పార్టీ ఉంటుందని బీజేపీ భావిస్తుంది. మరోవైపు… కృష్ణం రాజు చాలా కాలంగా సినిమాలకు దూరం అయ్యారు. ఆరోగ్య సమస్యలు కూడా ఉండటంతో ఇంట్లోనే విశ్రాంతిగా ఉంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories