ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మాణంలో తాజాగా తెరకెక్కిన చిత్రం ‘శంకరాభరణం’. నిఖిల్ హీరోగా నందిత హీరోయిన్గా ఉదయ్ నందనవనం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల కొన్ని రోజులు ఉందనంగా కోన వెంకట్ దర్శకత్వ పర్యవేక్షణ అంటూ టైటిల్ వేస్తున్నారు. కథ, స్క్రీన్ప్లే, మాటలు అందించిన కోన వెంకట్ ఈ సినిమాను అంతా తానై ముందుండి నడిరపిచాడు అని, షాడో డైరెక్టర్గా వ్యవహరించాడు అంటూ కొన్ని కామెంట్స్ వినిపించాయి. ఈ విషయంపై తాజాగా దర్శకుడు ఉదయ్ క్లారిటీ ఇచ్చాడు.
దర్శకుడు ఉదయ్ నందనవనం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కోన గారు దర్శకత్వ పర్యవేక్షణ వేసుకునే విషయం తనకు ముందు చెప్పలేదు అని, అయినా కోన గారు ఈ సినిమాతో ట్రావెల్ చేశారు. ఈ సినిమా కథ ఆయనది, మాటలు, స్క్రీన్ప్లే ఆయన అందించారు. షూటింగ్ జరుగుతున్నని రోజులు మాతో ఉన్నారు. పైగా ఆయన్ను నేను అన్నయ్య అని పిలుస్తాను, అందువల్ల ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ అని కోన గారు వేసుకుంటే నాకు ఏమీ ఇబ్బంది లేదు అని, కాకపోతే ఈ సినిమా నాది అని మాత్రం నేను చెప్పగలను అని ఉదయ్ చెప్పుకొచ్చాడు. కోన దర్శకత్వ పర్యవేక్షణ టైటిల్ వేసుకోవడం వల్ల సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా కూడా ఆయనకే వెళ్లే అవకాశాలున్నాయి. మరి అప్పుడు ఉదయ్ ఎలా ఫీలవుతాడో చూడాలి.





