అమెరికా ఫ్లైట్ ఎక్కిన సర్కారు వారి పాట టీమ్

Mahesh Babu Sarkaru Vaari Pata Blockbusterతమ సినిమా షూటింగ్ కు సంబంధించిన లొకేషన్లను ఖరారు చేయడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క సర్కారు వారి పాట బృందం అమెరికా వెళ్లింది. దర్శకుడు పరశురామ్, సినిమాటోగ్రాఫర్ ఆర్ మాధి, ఆర్ట్ డైరెక్టర్ ఎ.ఎస్. ప్రకాశ్ నిన్న రాత్రి ముంబై విమానాశ్రయం నుంచి అమెరికా వెళ్లే ఫ్లైట్ ఎక్కారు

ఈ చిత్రం షూటింగ్‌ను అమెరికాలో నవంబర్ రెండవ వారం నుంచి ప్రారంభించాలని వారు యోచిస్తున్నారు. అక్కడ ఫ్లాష్‌బ్యాక్ కు చెందిన కొన్ని భాగాలను షూట్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. జనవరి 2021 నాటికి 50% షూట్ పూర్తి చేయాలనేది లక్ష్యం. ఇంతకుముందు ఈ చిత్రం ఉగాది 2021 విడుదలకు ప్లాన్ చేయబడింది.

ADVERTISEMENT

కాని ఇప్పుడు వచ్చే ఏడాది దసరాకు వాయిదా పడే అవకాశం ఉంది. ఈ చిత్రానికి బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్‌ను మెయిన్ విలన్‌గా తీసుకోవాలని వారు యోచిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం విద్యాబాలన్ తో కూడా చర్చలు జరుపుతున్నారట. అదే జరిగితే, వారి చేరిక సినిమా బాలీవుడ్ మార్కెట్‌ను పెంచుతుంది.

ఈ సినిమాలో హీరోయిన్ గురించి అధికారిక ప్రకటన రాలేదు. మహేష్ సొంత బ్యానర్‌తో పాటు మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ దీనిని నిర్మించనున్నాయి. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా థమన్ ను ఫైనల్ చేసారు. ఈ చిత్రానికి పాటల రికార్డింగ్‌ను ఆయన త్వరలో ప్రారంభిస్తారు.

ADVERTISEMENT
Latest Stories