వరంగల్ ఉపఎన్నిక ఫలితం చెల్లదు! కోర్టులో కేసు!

Sarve-Satyanarayana-files-petition-on-khamam-bi-electionsఇటీవల జరిగిన వరంగల్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్ధి పసునూరి దయాకర్ దాదాపు 4.6 లక్షల ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి పార్టీలకు కనీసం డిపాజిట్లు కూడా దక్కకుండా పోయిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సర్వే సత్యనారాయణ రెండవ స్థానంలో నిలిచారు.

ఒకప్పుడు కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సర్వే సత్యనారాయణ ప్రస్తుతం వరంగల్ ఉప ఎన్నికల ఫలితంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. దానికి సంబంధించిన సాంకేతిక కారణాలను కూడా జోడించి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్ట్ స్పందన ఎలా ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ADVERTISEMENT

“వరంగల్ ఉప ఎన్నికల నామినేషన్ దాఖలు చేసే సమయానికి పసునూరి దయాకర్ కు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లో ఎల్పీజీ పంపిణీ ఒప్పందం ఉందని, అలాగే దయాకర్ సతీమణి ఎల్పీజీ పంపిణీదారునిగా ఉన్నారని, ప్రభుత్వ సంస్థలతో ఒప్పందం ఉన్నవారు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులని, ఎన్నికల అఫిడవిట్ లో సమర్పించిన సమాచారంలో తప్పులున్నాయని, అందువలన పసునూరి దయాకర్ ఎన్నిక చెల్లదని” సర్వే చేస్తున్న వాదనకు హైకోర్ట్ ఎలాంటి తీర్పునిస్తుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories