గ్రీన్ మరియు ఆరెంజ్ జోన్లలోని లాక్డౌన్ కు ప్రభుత్వాలు కొన్ని సడలింపులు ఇస్తున్నాయి. కొన్ని ప్రభుత్వాలు అయితే రెడ్ జోన్లలో కూడా మద్యం దుకాణాలను తెరిచాయి. అయితే కరోనా ముప్పు తొలగడం అనేది ప్రస్తుతానికి చాలా దూరంగా ఉందని నిపుణులు అంటున్నారు. సాధారణ స్థితి ఇప్పట్లో రాదు అని హెచ్చరిస్తున్నారు.
“ప్రస్తుతం, కేసులు ఫ్లాట్ రేట్ లో పెరుగుతూనే ఉన్నాయి, కొన్నిసార్లు మరింత ఎక్కువ. కాబట్టి, పీక్ ఎప్పుడు వస్తుందో ఊహించడం చాలా కష్టం. అయితే జూన్ లేదా జూలైలో ఇది గరిష్ట స్థాయికి (పీక్) చేరుకుంటుంది. ఆ తరువాత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది” అని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఎరుపు జోన్లు, హాట్స్పాట్లు మరియు ప్రక్కనే ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ మరియు ఇతర దూకుడు చర్యలను విధించడం కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇటువంటి కఠినమైన సామాజిక దూర చర్యలు తీసుకున్న చాలా ఇతర దేశాలు – ఇటలీ మరియు చైనా వంటివి ఒక నెల తరువాత దాని ప్రయోజనాలను చూడటం ప్రారంభించాయని ఆయన చెప్పుకొచ్చారు.
భారత్ లో కరోనా కేసులు 52,952కు చేరుకున్నాయి. ఇప్పటివరకు 15,000కు పైగా బాధితులు ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే దాదాపుగా 1,800 మంది మరణం బారిన పడ్డారు. దేశంలో లాక్ డౌన్ ఇప్పటికే 17వరకు పొడిగింపబడింది. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 29వరకు పొడిగించింది.





