పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయబోతున్న ఓ సినిమాకు సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది. 2015, ఫిబ్రవరి 23వ తేదీన దర్శకరత్న దాసరి నారాయణరావు చేసిన ‘పవన్ కళ్యాణ్ తో ఓ సినిమాను ప్రారంభిస్తానన్న ప్రకటన’ టాలీవుడ్ లో సంచలనాత్మకమైంది. అయితే అప్పటినుండి హల్చల్ చేసిన ఈ వార్త మధ్యమధ్యలో తెరపైకి వచ్చింది గానీ, కార్యరూపం మాత్రం దాల్చుకోలేదు.
పవన్ అభిమానులు మాత్రం ఈ సినిమా ఇలాగే వాయిదాలు పడుతూ ‘వాయిదా సంవత్సరాలు’ జరుపుకోవాలని సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా దాసరి దర్శకత్వం వహిస్తారనే భయంతోనే ఈ సినిమా ప్రారంభం కాకూడదని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు తానూ దర్శకత్వం వహించనని దాసరి ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా తర్వాత దాసరి బ్యానర్ లోనే సినిమా ఉండవచ్చని ఒక అంచనా.
ADVERTISEMENT

ADVERTISEMENT





