తెలంగాణ శాసనసభా ఎన్నికలపై జనసేన కొంత మేర క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… ముందస్తు ఎన్నికలు రావాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో 24 స్థానాలకు పోటీ చేయాలనకుంటున్నామని, నాలుగైదు రోజుల్లో తెలంగాణ పార్టీ నేతలతో చర్చించి.. దీనిపై స్పష్టత ఇవ్వనున్నట్టు చెప్పారు.
[m9ad]
మరోవైపు సీమాంధ్రులు ఎక్కువగా ఉండే చోట్ల జనసేనను పోటీకి దింపే ఆలోచన పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టు సమాచారం. ఆ ప్రకారంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాదు, వరంగల్ లాంటి చోట్ల ఎక్కడైతే ఎక్కువగా సెటిలర్లు ఉంటారో అక్కడ పార్టీ అభ్యర్థులను నిలబెట్టే అవకాశం ఉంది.
అయితే జనసేన పోటీ చేస్తే అది మహాకూటమికి నష్టం చేసి అధికార పార్టీకి బెనిఫిట్ అవ్వడం ఖాయం. ఒకరకంగా పవన్ కళ్యాణ్ కేసీఆర్ దీని మీద ఒక ముందస్తు అవగాహన తో ముందుకు వెళ్తున్నారా అనే అనుమానం కూడా ఉంది. అయితే పోటీ చేసిన చోట్ల వ్యతిరేక ఫలితాలు వస్తే అది జనసేన ఇమేజ్ మీద మచ్చ అనే అనుకోవాలి.



