శ్రీదేవి కూతురి కెరీర్ కు అనుకోని దెబ్బ

Janhvi- Kapoorఅతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ మూడేళ్ల క్రితం ధడక్ అనే సినిమాతో చిత్రసీమలో గ్రాండ్ గా అడుగుపెట్టింది. ఆమె లైవ్లీ పెరఫార్మన్స్ తో మంచి పేరు వచ్చింది. అయితే ఆమె రెండవ చిత్రం ఘోస్ట్ స్టోరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్టుగా విడుదలైంది. కరోనా ప్రభావం కారణంగా, ఆమె తదుపరి రెండు చిత్రాలు, గుంజన్ సక్సేనా మరియు రూహి అఫ్జానా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం లేదు.

ఈ రెండు సినిమాల కోసం జాన్వి చాలా కష్టపడిందట. ఎన్నో ఆశలు పెట్టుకున్న తరువాత రెండు చిత్రాలకు డైరెక్ట్ గా డిజిటల్ లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది ఆమె కెరీర్‌పై ప్రభావం చూపుతుందేమో అని బోనీ కపూర్ ఆందోళన చెందుతున్నారు. డిజిటల్ రిలీజ్ అంటే ఆమెకు దక్కాల్సిన ఎక్సపోజర్ రాదని బోనీ అనుకుంటున్నారు.

ADVERTISEMENT

అదే సమయంలో ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో నిర్మాతలపై ఒత్తిడి చెయ్యడం కష్టం. దీనితో ఏమీ చెయ్యలేని పరిస్థితి. మరోవైపు, జాన్వి యొక్క తెలుగు అరంగేట్రం గురించి ఊహాగానాలు ఇంకా ఉన్నాయి. తాజాగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఆమె చెయ్యొచ్చని పుకార్లు వినిపిస్తున్నాయి.

ఆమె రాకను బిగ్గరగా ప్రకటించడానికి ఆమె ఇక్కడ ఒక భారీ ప్రాజెక్ట్ కోసం చూస్తున్నట్లు వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బోనీ కపూర్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో తెలుగులో నిర్మాతగా అరంగేట్రం చెయ్యబోతున్నారు. దిల్ రాజు ఈ సినిమాకు సహా నిర్మాత. ఆగష్టులో విడుదల అయ్యే అవకాశం ఉంది.

ADVERTISEMENT
Latest Stories