ఇటీవలే దుబ్బాక ఉపఎన్నికలో విజయం సాధించి సంచలనం సృష్టించిన బీజేపీ అదే విజయం జీహెచ్ఎంసి ఎన్నికలలో కూడా సాధించి తన సత్తా చాటాలని కృతనిశ్చయంతో ఉంది. పార్టీ జాతీయ కార్యదర్శి భూపేందర్ యాదవ్ ని ఎన్నికల ఇంఛార్జి గా నియమించింది. ఒక కార్పొరేషన్ ఎన్నికకు జాతీయ స్థాయి నేతను రంగంలోకి దించడం విశేషం.
అలాగే ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డిని నియమించింది. ఆ కమిటీకి కన్వీనర్గా జాతీయ పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మ ణ్, జాయింట్ కన్వీనర్లుగా డాక్టర్ వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్రావు, చింతల రాంచంద్రారెడ్డిని నియమించారు.
సభ్యులుగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పి.ము రళీధర్రావు, రాజాసింగ్, ఎన్.రాంచంద ర్రావు, ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, ఇంద్రసేనారెడ్డి, ఏపీ జితేందర్రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మో త్కుపల్లి నర్సింహులు, డి.రవీంద్రనాయక్, పొంగులేటి సుధాకర్రెడ్డి, కె.రాములు, రాపో లు ఆనందభాస్కర్, ఎం.రఘునందన్రావు, జి.ప్రేమేందర్రెడ్డి, దుగ్యాల ప్రదీప్కుమార్, బంగారు శృతిని నియమించారు.
మొత్తానికి ఈ ఎన్నికలలో విజయం కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుంది. ఈ ఎన్నికలలో బీజేపీ గెలిచినా, గణనీయంగా సీట్లు సాధించినా ఇప్పటికిప్పుడు తెరాస ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం ఏమీ లేకపోయినా, తెలంగాణలో తెరాసకి అసలైన ప్రత్యామ్న్యాయం బీజేపీనే అనే మెస్సేజ్ వెళ్తుంది.





