కరోనా సంక్షోభ సమయంలో రెండుసార్లు విరాళం ఇచ్చిన మహేష్ బాబు

Mahesh Babu donation to movie workers during coronovirus lockdownకరోనా సంక్షోభం సమయంలో ఉదార విరాళాలు ఇవ్వడానికి పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు. వారిలో చాలామంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి సహకరించగా, కొందరు లాక్డౌన్ సమయంలో రోజు కూలి రాక పస్తులు ఉంటున్న చిత్ర కార్మికుల సంక్షేమానికి తోడ్పడ్డారు.

ADVERTISEMENT

ఈ రెండింటికి సహకరించిన మొదటి సెలబ్రిటీ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సూపర్ స్టార్ కరోనా నియంత్రణ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇప్పటికే ఒక కోటి విరాళం ప్రకటించారు. ఇప్పుడు, కష్టాల్లో ఉన్న సినీ కార్మికుల కోసం మరో 25 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

“లాక్డౌన్ పరిస్థితి రోజువారీ వేతన సినీ కార్మికుల జీవితాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ కార్మికుల కోసం కరోనా సంక్షోభ సమయంలో రూ .25 లక్షలు ఇవ్వాలని నిర్ణయించుకున్న. ఈ విపత్కర సమయాల్లో తోటి నటులందరూ ముందుకు వచ్చి తమ వంతు కృషి చేయాలని అభ్యర్థిస్తున్నారు” అని మహేష్ బాబు ట్వీట్ చేశారు కొద్దిసేపటి క్రితం.

ఇది ఇలా ఉండగా… ఈ సంక్షోభ సమయంలో తెలుగు సినీ ప్రముఖులు ముందుకు వచ్చి సాయం చేసినంతగా ఏ ఇండస్ట్రీ సెలెబ్రిటీలు ఇంతవరకూ ముందుకు రాలేదు. తమిళ హీరోలు సినీ కార్మికులకు కొంత సాయం చేసిన, పెద్ద మొత్తలు అయితే కాదు. అక్కడి ప్రభుత్వానికి అయితే అసలు ఇవ్వలేదు. ఇక బాలీవుడ్ లో అటువంటి వాతావరణమే కనిపించడం లేదు.

ADVERTISEMENT
Latest Stories