సర్కారు వారి పాట డైరెక్టర్ కు షాక్ ఇవ్వనున్న మహేష్ బాబు?

Mahesh Babu Fan Forcing Him to Announceసూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్ సర్కారు వారి పాటను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారని, దాని ప్లేస్ లో మొదట త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ఒక చిత్రాన్ని తీయాలని అనుకుంటున్నట్టు నివేదికలు వెలువడుతున్నాయి. ఈ స్టార్ డైరెక్టర్ మహేష్ కు ఒక స్క్రిప్ట్‌ను వినిపించాడట. అవకాశం ఇస్తే ఆగస్టు నాటికి పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనుమతి ఇస్తే త్రివిక్రమ్ చిత్రం సంక్రాంతి 2021 తర్వాత సెట్స్ మీదకు వెళ్తుంది. అయితే, ఎన్టీఆర్ కనీసం ఆరు నెలల పాటు ఆర్‌ఆర్‌ఆర్‌తో బిజీగా ఉంటాడు. ఆ తరువాత రెండు మూడు నెలల విరామం కూడా తీసుకునే అవకాశం ఉండటంతో అభ్యంతరం చెప్పే అవకాశం లేదట.

ADVERTISEMENT

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ చిత్రం సమ్మర్ 2020 కోసం ప్రారంభం కావాల్సి ఉంది, కాని కరోనా వైరస్ పాండమిక్ వల్ల ఆలస్యం అయ్యింది. మహేష్ ఇటీవల త్రివిక్రమ్ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపారు… అభిమానులు దీనిని సూచనగా తీసుకుంటున్నారు. అయితే ఇదే గనుక నిజమైతే పరశురామ్‌కు తీవ్ర నిరాశ కలిగిస్తుంది.

మహేష్ బాబు త్రివిక్రమ్ గతంలో అతడు, ఖలేజా సినిమాలు చూశారు. అతడు ఇప్పటికి కూడా టెలివిజన్ లో విపరీతంగా రిపీట్ వేల్యూ ఉన్న సినిమా. ఖలేజా బాక్స్ ఆఫీస్ వద్ద సరిగ్గా ఆడనప్పటికీ ఆ సినిమా నుండే మహేష్ బాబు కామెడీ టైమింగ్ లో చాలా మార్పు వచ్చింది. చాలా మందికి అది మహేష్ సినిమాలలో తమ ఫేవరెట్ కూడా.

ADVERTISEMENT
Latest Stories