బాలయ్య కోసం మలయాళీ భామ

Nandamuri Balakrishna - Prayaga Martinబోయపాటి శ్రీనుతో నందమూరి బాలకృష్ణ చేస్తున్న చిత్రం కోసం నందమూరి అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. జూన్‌లో విడుదలైన ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ఈ చిత్రం పై ఉన్న హైప్ మరియు అంచనాలను పెంచింది. దీనితో సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఒక యాక్షన్ సన్నివేశాన్ని షూట్ చేసిన తర్వాత సినిమా షూటింగ్ నిలిచిపోయింది. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ అందరు షూటింగులు మొదలుపెడుతున్నా బాలయ్య మాత్రం పెదవి విప్పడం లేదు. స్క్రిప్ట్ ప్రకారం ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. మలయాళ నటి ప్రగ్యా మార్టిన్ కథానాయికలలో ఒకరిగా ధృవీకరించబడింది.

ADVERTISEMENT

ఓరు మురై వంతు పార్థాయ అనే సినిమాలోని పార్వతి పాత్రలో తన అభినయంతో ఈ మలయాళీ భామ ప్రశంసలు అందుకుంది. మిస్కిన్ దర్శకత్వం వహించిన ‘పిసాసు’ చిత్రానికి ఆమె ఉత్తమ కొత్త తమిళ నటిగా ఎంపికైంది. ప్రస్తుతం ఒక గౌతమ్ మీనన్ అంథాలజీ ప్రాజెక్టు లో నటిస్తుంది ఈ సినిమాలోని మరో హీరోయిన్ పేరు ఇంకా ఖరారు కాలేదు.

మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత కంపోజర్. ఇంతకుముందు ఈ సినిమాకు మోనార్క్ అనే టైటిల్ పరిశీలనలో ఉందని పుకార్లు ఉన్నాయి. బోయపాటికి సరైనోడు తరువాత హిట్ లేదు. దీనితో ఈ సినిమా హిట్ కావడం ఆయనకు కూడా కీలకం. అలాగే బాలయ్య కూడా గత ఏడాది వరుసగా మూడు ప్లాపులతో ఫ్యాన్స్ కు భాకీ ఉన్నాడు.

ADVERTISEMENT
Latest Stories