తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు పెట్టి కేవలం మూడేళ్ళలోనే పూర్తిచేశారు. కానీ దశాబ్దాలుగా నిర్మాణం సాగుతున్న పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని మాజీ మంత్రి అంబటి రాంబాబు కుండ బద్దలు కొట్టడంతో ఆంధ్రా ప్రజలు దానిపై ఆశలు వదిలేసుకున్నారు.
కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టగానే దాని పనులు వేగవంతం చేయడమే కాకుండా 2027లో పూర్తి చేస్తామని ఇటీవలే ప్రకటించారు కూడా.
ADVERTISEMENT
ఆంధ్రాకు పోలవరం, తెలంగాణకు కాళేశ్వరం జీవనాడి వంటివే. ఒకవేళ మేడిగడ్డ బ్యారేజ్ చెక్కుచెదరకుండా ధృడంగా నిలబడి ఉండి ఉంటే, నేడు కాళేశ్వరంపై ఇన్ని రాజకీయాలు జరుగుతుండేవి కావు.
ఎలాగూ ఈ రెండు ప్రాజెక్టుల గురించి చెప్పుకుంటున్నాము కనుక వాటి గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం.

ADVERTISEMENT




