యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన రాధే శ్యామ్ యొక్క ఇటలీ షెడ్యూల్ ను ఇటీవలే పూర్తి చేశారు. ఒక షెడ్యూల్ మినహా మొత్తం షూటింగ్ పూర్తయింది. ఈ షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఈ షెడ్యూల్లో క్లైమాక్స్ ని షూట్ చేయాల్సి ఉంది. క్లైమాక్స్ ఎపిసోడ్ల కోసం మేకర్స్ భారీగా 30 కోట్లు కేటాయించారు.
ఏ షూట్ కోసం ప్రత్యేక సెట్ ఏర్పాటు చేయనున్నారు మరియు హాలీవుడ్ టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ క్లైమాక్స్ యాక్షన్ స్టంట్ను పర్యవేక్షిస్తారు. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది. రాధే శ్యామ్ ఈ ఏడాది దసరాకు విడుదల కావాల్సింది. అయితే కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడింది.
రాధే శ్యామ్ 2021 ఏప్రిల్ సమ్మర్ స్పెషల్ గా విడుదల కానుంది. అప్పటికి కోవిడ్ ప్రభావం తగ్గుతుందని మేకర్స్ ఆశిస్తున్నారు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ ఈ సినిమా కోసం మెగాఫోన్ను పట్టుకున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా జస్టిన్ ప్రభాకర్ ఖరారయ్యారు. ఆయన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్లకు సంగీతం అందించనున్నారు.
హిందీ వెర్షన్ కు సాహూ మాదిరిగా అనేక మంది మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ప్రభాస్ తాజా చిత్రాల మాదిరిగా ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ఒకే సారి విడుదల అవుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ప్రభాస్ వచ్చే ఏడాది మొదట్లో తన ఆదిపురుష్ షూటింగ్ మొదలుపెడతాడు.





