ఆడియో వేడుక లేదంటూ నిరుత్సాహపరిచిన ‘అరవింద సమేత’ చిత్ర నిర్మాణ సంస్థ, అభిమానులకు నేడు ఓ సర్ ప్రైజ్ ఇస్తామంటూ హామీ ఇచ్చింది. బహుశా రెండవ పాటను రిలీజ్ చేస్తారేమోనన్న ఆలోచనలతో, యంగ్ టైగర్ అభిమానులు చిత్ర నిర్మాణ సంస్థను, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి గారిని సోషల్ మీడియా వేదికగా తెగ ప్రశ్నిస్తున్నారు.
[m9ad]
ఓ అభిమాని వేసిన ప్రశ్నపై స్పందించిన రామ్ జో… “వీడియో రెడీ అవుతోంది, టీం అదే పని మీద ఉంది, మీలో ఉన్న ఉత్సాహం దాచుకోండి, ఎప్పుడొచ్చినా ఈ పాట గుండెలు పిండేస్తుంది” అంటూ ఫ్యాన్స్ కు కావాల్సిన సందేశాన్నిచ్చారు. అయితే ఆ పాట నేడు రిలీజ్ అవుతుందా? లేదా అన్న విషయం స్పష్టత ఇవ్వలేదు. ఫుల్ ఆల్బమ్ అయితే మరో రెండు రోజుల్లో యూ ట్యూబ్ లో ప్రత్యక్షం కానుంది.
ఈ సినిమాలో కేవలం నాలుగు పాటలు మాత్రమే ఉన్నాయన్న టాక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వ్యాప్తి చెందిపోయింది. విదేశాల్లో చిత్రీకరించాల్సిన ఓ సాంగ్ ను రిలీజ్ డేట్ దృష్ట్యా, తొలగించారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంతుందో తెలియాలంటే, మరో రెండు రోజులు ఆగాల్సిందే. త్రివిక్రమ్ మూవీకి మొదటిసారిగా ఎస్.ఎస్.థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
Love u…video ready avuthondhi..team adhe pani meedha unnaaru…excitement daachukondi…eppudochinnaa ee paata…గుండెలు పిండేస్తుంది 👍 https://t.co/6pgBlkHFT8
— Ramajogaiah Sastry (@ramjowrites) September 18, 2018





