మెగాస్టార్ చిరంజీవి ఆచార్య నిర్మాతలకు కాజల్ అగర్వాల్ నో చెప్పినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆమె ఒక తమిళ చిత్రానికి పెద్ద మొత్తంలో డేట్స్ ఇచ్చిందని అయితే లాక్డౌన్ కారణంగా ఆచార్యకు డేట్స్ ఇబ్బంది అయ్యాయని, అందుకే ఆమె తప్పుకుందని నివేదికలు తెలిపాయి.
దాని గురించి ఒక వివరణ వచ్చింది. “నేను స్థితి గురించి తిరిగి తెలుసుకోవడానికి కాజల్ అగర్వాల్తో మాట్లాడాను. ఈ వార్తల్లో నిజం లేదు. ఆమె ఆచార్య చేస్తుంది. ఈ వార్తా నివేదికలు నిరాధారమైనవి” అని నటి మేనేజర్ స్పష్టం చేశారు. ఖైదీ నెం 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కాజల్ రెండో సారి కలిసి నటిస్తుంది.
క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా చూపుతూ త్రిష్ణ తప్పుకున్న తర్వాత ఆమెను ఈ ప్రాజెక్టులోకి తీసుకువచ్చారు. ఆచార్య షూటింగ్ 40% పూర్తి అయ్యింది. మొదట్లో ఆగస్టు 14న విడుదల చెయ్యాలి అనుకున్నా ఇప్పుడు సంక్రాంతి కి విడుదల అవకాశాలను పరిశీలిస్తున్నారు. అయితే అది ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి రాకపోతేనే.
ఆచార్యలో చిరంజీవి ఒక మాజీ నక్సలైటుగా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ఎండోమెంట్స్ విభాగంలో అవినీతికి సంబంధించిన సబ్జెక్టు గురించని సమాచారం. చాలా ఏళ్ల తరువాత మణి శర్మ చిరంజీవితో కలిసి ఈ చిత్రంలో పనిచేస్తున్నారు. గతంలో వారిద్దరూ సెన్సషనల్ ఆల్బమ్స్ ఇచ్చారు.





