కరోనా రిలీఫ్ కార్యక్రమాలకు ఇలయదళపతి విజయ్ 1.3 కోట్ల సాయం అందించారు. అతను తన సినిమాలు విడుదల అయ్యే అన్ని రాష్ట్రాలకు ఆ నిధులను పంపిణీ చెయ్యడం గమనార్హం. సహాయం యొక్క పరిమాణం కూడా ఆయా రాష్ట్రాలలో అతని మార్కెట్ నిష్పత్తిలో ఉండడం గమనార్హం.
దాని ప్రకారం తమిళనాడుకు అత్యధికంగా విరాళం ఇచ్చారు. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కు 25 లక్షలు, తమిళనాడు సిఎం రిలీఫ్ ఫండ్స్కు 50 లక్షలు విరాళంగా ఇచ్చారు. అలాగే తమిళనాడు ఫిల్మ్ వర్కర్స్ అసోసియేషన్ కోసం మరో 25 లక్షలు విరాళంగా ఇచ్చారు.
అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరి సిఎం రిలీఫ్ ఫండ్లకు ఒక్కొక్కటి ఐదు లక్షలు ఇచ్చారు. బాధిత ప్రజలకు నేరుగా సహాయం చేయడానికి అతను తన అభిమాని క్లబ్లకు కూడా కొంత మొత్తాన్ని పంపిణీ చేశాడు. ఇది ఇలా ఉండగా విజయ్ తాజా చిత్రం, మాస్టర్ లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది.
ఈ చిత్రం ఏప్రిల్ 9 న విడుదల కావాల్సి ఉంది, కానీ ఇప్పుడు అది నిరవధికంగా వాయిదా పడింది. ఈ చిత్రానికి కార్తీకి ఖైదీ సినిమాతో పెద్ద హిట్ ఇచ్చిన లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మాళవిక మోహనన్ హీరోయిన్. ఇందులో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్గా.. విజయ్ సేతుపతి గ్యాంగ్ స్టర్గా నటించారు.





