అయ్యప్పనమ్ కోషియం యొక్క తెలుగు రీమేక్లో పవర్స్టార్ పవన్ కళ్యాణ్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు చేసే అవకాశం ఉందని ఆసక్తికరమైన వార్తలు వెలువడుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ ని ఇచ్చే అవకాశం ఉండగా యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించే అవకాశం ఉంది.
వెంకీ ప్రస్తుతం రంగ్ దేతో బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది మరియు అది పూర్తయ్యాక, అతను ఈ ప్రాజెక్ట్కు వెళ్తాడు. ఈ ఏడాది నితిన్ భీష్మాతో విజయవంతం అయిన సీతారా ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రానికి రీమేక్ హక్కులను దక్కించుకుంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది.
పవన్ కళ్యాణ్ ఇప్పటికే వకీల్ సాబ్ అనే రీమేక్ ప్రాజెక్ట్ తో తిరిగి వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ రీమేక్లు బానే చేస్తున్నారు. దానితో అభిమానులకు ఈ వార్త అసలు నచ్చలేదు. పైగా అయ్యప్పనమ్ కోషియం సినిమా పవన్ కళ్యాణ్ కు సూట్ కాదని వారి అభిప్రాయం.
థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రం రాజీపడని ఇద్దరు అహంభావం గల వ్యక్తుల జీవితాల నేపథ్యంలో తెరకెక్కింది. తమిళంలో హిందీలో కూడా ఈ సినిమాను రీమేక్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నాడు. తన జెఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించబోతున్నాడు.



