స్కిల్ కేసు నుండి బెయిలు పొంది, కంటికి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న చంద్రబాబు నేడు ఒక్కసారిగా ఢిల్లీలో ప్రత్యేక్షమయ్యారు. వైసీపీ ప్రభుత్వం తన పైన పెట్టిన కేసులను వాదిస్తున్న సిద్దార్ద్ లూథ్రా కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరు కావడానికి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న బాబుకి పార్టీ ఎంపీలు ఘన స్వగతం పలికారు.
అయితే సుదీర్ఘ కాలం తరువాత చంద్రబాబుని మీడియాలో చూసిన బాబు అభిమానులను, టీడీపీ శ్రేణులు “బాబు ఈస్ బ్యాక్ టూ నార్మల్” అంటూ బాబు పిక్స్ ను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఒక పక్క బాబు అరెస్టుతో రాష్ట్రంలో ఆగిన లోకేష్ యువగళం పాదయాత్ర నేటి నుంచి పునరుద్ధరించి ప్రజాక్షేత్రంలోకి వచ్చారు లోకేష్. అదే సమయంలో ప్రజలకు, మీడియాకు దూరంగా విశ్రాంతి తీసుకుంటున్న చంద్రబాబు మీడియా కంట పడడంతో టీడీపీ శ్రేణులలో ఉత్సహం పెరిగింది.
అయితే బాబు ఢిల్లీ పర్యటనలో చంద్రబాబుతో పాటుగా వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన రఘురామా రాజు కూడా ఉండడంతో ఇక వైసీపీ నేతల సొంత కథనాలకు మంచి ఆహారం దొరికినట్లయింది.




