శ్రీకాకుళానికి వచ్చేసిన మాయదారి వైరస్

Coronavirus case in srikakulam districtఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కానీ జిల్లాలుగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఉండేవి. అయితే ఈరోజు విడుదలైన మెడికల్ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటలలో జిల్లాలో మూడు కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.

ఇప్పుడు విజయనగరంలో మాత్రమే కేసులు లేవు. గత 24 గంటల్లో 61 కొత్త కేసులతో రాష్ట్రంలోని మొత్తం 1016 కేసులకు చేరుకున్నాయి. దేశంలో 1000 కేసులను దాటిన ఎనిమిదో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మూడు బ్యాక్ టు బ్యాక్ రోజుల పాటు రాష్ట్రంలో యాబైకు పైగా కేసులు వచ్చాయి. రెండు కొత్త మరణాలు కూడా సంభవించాయి.

ADVERTISEMENT

ఏప్రిల్ 21 తర్వాత రిలాక్సేషన్స్ ఇచ్చినప్పటి నుండి కేసులు పెరగడం ప్రారంభించాయి. రాష్ట్రంలో కర్నూలులో అత్యధికంగా 275 కేసులు ఉన్నాయి. గుంటూరు 209 కేసులతో రెండవ స్థానంలో ఉంది, కృష్ణ తరువాత 127 కేసులు ఉన్నాయి. 31 మంది చనిపోవడం, 171 మంది డిశ్చార్జ్ కాగా రాష్ట్రంలో 814 క్రియాశీల కేసులు ఉన్నాయి.

అయితే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మాత్రమే టెస్టులు పెరగడంతోనే కేసులు పెరుగుతున్నాయని, ఆందోళన చెందక్కర్లేదని అంటున్నారు. ఇది ఇలా ఉండగా… కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 24,506.

ADVERTISEMENT
Latest Stories