ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న లవ్ స్టోరీ అనే చిత్రం లో యువ సామ్రాట్ నాగ చైతన్య నటిస్తున్నాడు. కరోనా సంక్షోభం కారణంగా ఈ చిత్రం విడుదల తేదీ లో క్లారిటీ లేకుండా పోయింది. ఒక ఇంటర్వ్యూలో, మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ నాగ చైతన్యతో తన తదుపరి చిత్రంపై ఆసక్తికరమైన విషయాలు వెల్లండించారు.
“స్క్రిప్ట్ పని దాదాపుగా పూర్తయింది. దీనిలో మంచి వినోదం, రొమాన్స్ మరియు యాక్షన్ ఉంటుంది” అని విక్రమ్ అన్నారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా ‘థాంక్స్’ అని పేరు పెట్టారని నివేదికలు ఉన్నాయి. సీనియర్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు . ఈ ఏడాది చివర్లో సినిమా షూటింగ్ ప్రారంభించాలనేది ప్రణాళిక.
ఈ చిత్రం యొక్క అధికారిక ప్రకటన అతి త్వరలో జరుగుతుంది. విక్రమ్ మరియు నాగ చైతన్య మనమ్ వంటి క్లాసిక్ అందించినందున ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఎక్కువగా ఉంటాయి. మనం తరువాత విక్రమ్ సరైన హిట్ అందుకోలేదు. దానితో ఈ సినిమా విజయం సాధించాలని ఆయన పై ఒత్తిడి ఉంటుంది.
విక్రమ్ కుమార్ తాజాగా నానితో ‘గ్యాంగ్ లీడర్’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. విక్రమ్ మొన్న ఆ మధ్య అఖిల్ తో హలో అనే సినిమా తీశాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తమ్ముడితో నిరాశపరచిన ఈ దర్శకుడు అన్నతో నైనా హిట్ కొడతాడేమో చూడాలి.





