ఆంధ్రప్రదేశ్ లో కరోనా హబ్ గా గుంటూరు

guntur Coronavirus hub in andhra pradeshనిన్న రాత్రి 9 గంటల నుండి ఈ ఉదయం 9 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ 12 కొత్త కరోనా కేసులను నమోదు చేసింది. దీనితో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కేసుల సంఖ్య 432 కు చేరుకుంది. వీటిలో మూడొంతుల కేసులు ఢిల్లీ జమాత్ కు సంబంధించినవే. 90 కేసులతో గుంటూరు కర్నూలు దాటి అత్యధిక కేసులు (84 కేసులు) ఉన్న జిల్లాగా అవతరించింది.

శ్రీకాకుళం, విజయనగరం మాత్రమే ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. మరోవైపు, రేపు గడువు ముగియనున్న దేశవ్యాప్త లాక్‌డౌన్ పొడిగింపు గురించి కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. లాక్‌డౌన్‌లో కేంద్ర ప్రభుత్వం జోనల్ వ్యవస్థను అమలు చేస్తుందని పుకార్లు ఉన్నాయి.

ADVERTISEMENT

కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల తీవ్రతను బట్టి ఆకుపచ్చ, ఆరెంజ్ మరియు రెడ్ జోన్లు గుర్తించబడతాయి. వీటిని నిర్దారించడానికి జిల్లాలను యూనిట్లగా తీసుకుంటారని సమాచారం. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ రేపటితో ముగియనుంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య సుమారు 10వేలకు సమీపంలో ఉంది.

దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు రాత్రి కీలక ప్రకటన చేస్తారని అంటున్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లో కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతుండటంతో లాక్‌డౌన్ కొనసాగించడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు నెలాఖరు వరకూ లాక్‌డౌన్ కొనసాగిస్తున్నట్లు ప్రకటించుకున్నాయి.

ADVERTISEMENT
Latest Stories