మహేష్ బాబు బావకు తృటిలో తప్పిన ప్రమాదం!

Mahesh-Babu-Galla-Jayadev-accidentసూపర్ స్టార్ కృష్ణ అల్లుడు, ప్రిన్స్ మహేష్ బాబు బావ గల్లా జయదేవ్ పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. తన సొంత నియోజకవర్గంలోని మేడికొండూరులో 6 కోట్ల రూపాయల విలువతో ఏర్పాటు చేయనున్న రెండు వంతెనలకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ఈ రోజు శంకుస్థాపన చేశారు.

అనంతరం తిరుగు ప్రయాణంలో భాగంగా గుంటూరు శివారు ప్రాంతంలో గల పెరిచర్ల వంతెనపై గల్లా జయదేవ్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్ లోని వాహనాలు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీకొన్నాయి. స్పీడుగా వెళుతున్న క్రమంలో జరిగిన ఈ ప్రమాదంలో జయదేవ్ కాన్వాయ్ లోని ఐదు వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే జయదేవ్ కు మాత్రం ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories