కరోనా ఎఫెక్ట్: సినిమా టిక్కెట్లు తగ్గే అవకాశం

Movie Theatre Ticket price may come downకరోనావైరస్ భయం మొత్తం దేశం మొత్తానికి నిద్రలేకుండా చేస్తుంది. లాక్డౌన్ కారణంగా ప్రభావితం కాని రంగం లేదు. థియేటర్లు సుదీర్ఘకాలం మూసివేయడం మరియు షూటింగ్‌లు జరగకపోవడంతో ఫిల్మ్ ఇండస్ట్రీ భారీగా నష్టపోయింది. లాక్డౌన్ సడలించిన తర్వాత కూడా, ప్రేక్షకులు కొన్ని నెలలు థియేటర్లకు దూరంగా ఉండే అవకాశం ఉన్నందున పరిస్థితులు ఇప్పట్లో చక్కబడే అవకాశం లేదు.

మరోవైపు, నిపుణులు కనీసం 2020 చివరి వరకు ఎకనామిక్ మందగమనాన్ని అంచనా వేస్తున్నారు. కాబట్టి, అది చిత్ర పరిశ్రమను కూడా ప్రభావితం చేస్తుంది. అయితే, సీనియర్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ దగ్గుబాటి సురేష్, ఆందోళన చెందడానికి ఏమీ లేదు, అయితే కొంత కాలం పాటు ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించడానికి టిక్కెట్ల రేటు తగ్గించాల్సి వస్తుందని అంటున్నారు.

ADVERTISEMENT

“లాకెట్‌డౌన్ తర్వాత థియేటర్లలో టికెట్ ధరలు తగ్గుతాయి. మన ప్రేక్షకులకు వినోదం అంటే చాలా ఇష్టం. సినిమా థియేటర్లలో చూసే ఎక్స్పీరియన్స్ కావాలని అనుకుంటారు. దీనితో ఈ ప్రభావం తాత్కాలికమే” అని సురేష్ బాబు అన్నారు. మరోవైపు, లాక్ డౌన్ మరో రెండు వారాలు పొడిగించే అవకాశం ఉందని అంటున్నారు.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం దేశంలో 7,447‬ కేసులు నమోదు అయ్యాయి. నిన్నటి మెడికల్ బులెటిన్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 381 కేసులు, తెలంగాణలో 487 కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మెజారిటీ కేసులు ఢిల్లీలో జరిగిన జమాత్ కార్యక్రమానికి సంబంధించినవే.

ADVERTISEMENT
Latest Stories