“నాన్నకు ప్రేమతో” సినిమా దేవిశ్రీప్రసాద్ ఆలపించే ఓ ప్రత్యేక గీతంతో ముగుస్తుంది. తన తండ్రి సత్యమూర్తికి అంకితం చేస్తూ రాసిన ఈ పాట లిరిక్స్ ఎంతో ఆహ్లాదకరంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు లభించిన ప్రజాదరణ దృష్ట్యా ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేసి మరీ మళ్ళీ ఈ పాటను విడుదల చేసారు. హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, దర్శకుడు సుకుమార్ తో సహా అందరూ హాజరై గ్రాండ్ గా ఈ పాటను విడుదల చేసారు.
“ఏ కష్టం ఎదురొచ్చినా… కన్నీళ్లు ఎదిరించినా… ఆనందం అనే ఊయ్యాలలో నను పెంచినా… నాన్నకు ప్రేమతో… నాన్నకు ప్రేమతో…” అంటూ దేవిశ్రీ, సాగర్ లు ఆలపించిన ఈ గీతం వారి నాన్న సత్యమూర్తికే కాదు, అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఈ పాట…
ADVERTISEMENT
ADVERTISEMENT





