గత కొద్ది కాలంగా రకుల్ ప్రీత్ సింగ్ ను పరాజయాలు వెంటాడుతున్నాయి. దీనితో ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోతున్నాయి. గత సంవత్సర కాలంగా రకుల్ కోలీవుడ్ లోనే ఎక్కువ కాలం గడుపుతుంది. ఈ సందర్భంగా వెంకటేష్ – నాగ చైతన్య నటిస్తున్న వెంకీ మామ చిత్రం ఆమె తలుపు తట్టింది. టాలీవుడ్ లోకి తిరిగి రావడానికి ఈ సినిమా తనకు టిక్కెట్ అనుకుంది రకుల్. అయితే ఇప్పుడు ఉన్న ఫళంగా ఆమె మార్చేశారు ఆ చిత్ర బృందం. ఆమె స్థానంలో నభ నటేష్ ను తీసుకున్నట్టు సమాచారం.
ఇదే సమయంలో మనం, ఇష్క్, 24 సినిమాల దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న నాని తదుపరి చిత్రానికి ఒక స్పెషల్ సాంగ్ కోసం ఆమెను సంప్రదించారట ఆ చిత్ర బృందం. ఇది ఒప్పుకోవాలా లేదా అని సందిగ్దతలో ఉంది ఆమె. సినిమాలు లేని తరుణంలో ఇప్పుడు ఇలాంటి పాటలు చేస్తే ఐటెం గర్ల్ ముద్ర వేసేస్తారా అనేది ఆమె భయం. దీనితో ఆమె ఎటూ తేల్చుకోలేని పరిస్థితి లో ఉందని సమాచారం. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉంటారట.
మరోవైపు కొంత మంది మాత్రం గతంలో కాజల్ అగర్వాల్ కూడా ఇటువంటి పరిస్థితిలోనే ఉండగా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాలో పక్కా లోకల్ అనే పాటకు డాన్స్ చేసింది. ఆ పాట ఆమె భాగ్యరేఖలు మార్చేసింది. ఇప్పుడు మళ్ళీ తెలుగు సినిమాలలో బిజీ అయిపోయింది. రకుల్ కూడా ఈ పాట అదే రకంగా ఉపయోగపుతుందని వారి వాదన. దీనిపై రకుల్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. తనకు కొంచెం టైమ్ ఇవ్వమని చిత్రబృందాన్ని ఆమె కోరినట్టు సమాచారం.



