టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నాడు. తన కుమార్తె తలనీలాలను స్వామి వారికి సమర్పించాడు. అనంతరం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నాడు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నాడు. తన భార్య స్నేహ, కుమారుడు, తన తల్లిదండ్రులతో కలసి తిరుమలకు విచ్చేసిన బన్నీ కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం వారికి తీర్థ ప్రసాదాలను అందించారు.
ADVERTISEMENT



