తప్పుడు రాతలపై ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు!

Chandrababu's bold and revolutionary decision!నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతల భూదందాపై వచ్చిన ఆరోపణలను ఖండించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వాటికి ఆధారాలు చూపించి, నిరూపించుకోవాల్సిన అవసరం సదరు పత్రికకు ఉందని అన్నారు. “తప్పుడు రాతలు రాసే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, సొంత అజెండాతో ఏపీ పరువు తీయాలని ప్రతిపక్షం ప్రవర్తిస్తుంటే” చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

ADVERTISEMENT

“తమపై నమ్మకంతోనే రైతులు భూములు ఇచ్చారని, ప్రజా రాజధాని అమరావతిపై ఆ పత్రిక విషం చిమ్ముతోందని, అమరావతి బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు, ప్రజల డబ్బుతోనే వారు పత్రిక పెట్టారని, రాష్ట్రానికి నష్టం చేసే విధంగా తప్పుడు రాతలు రాస్తున్నారని” తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తపరిచారు.

ADVERTISEMENT
Latest Stories