‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి చెరొక క్లాస్ అండ్ మాస్ పోస్టర్స్ ను చిత్ర నిర్మాణ సంస్థ రిలీజ్ చేసింది. అయితే హీరోయిన్ పూజా హెగ్డే మాత్రం తనదైన శైలిలో ఓ రొమాంటిక్ పోస్టర్ ను రిలీజ్ చేసి అభిమానులను ఉత్తేజపరిచింది. జూనియర్ ఎన్టీఆర్ అండ్ పూజాలు చెరొక సైకిల్ తొక్కుతూ ఉన్న ఈ పోస్టర్ రొమాంటిక్ గా ఉంది.
ADVERTISEMENT
[m9ad]
ముఖ్యంగా సైకిల్ పై జూనియర్ ఎన్టీఆర్ ను చూస్తూ అభిమానగణం పొంగిపోతోంది. గతంలో ‘కంత్రీ’ సినిమాలో తారక్ పలికిన డైలాగ్ లను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో యంగ్ టైగర్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్ది ఈ సినిమాపై అంచనాలు పెరుగుతుండడంతో, ఓపెనింగ్స్ లో సునామీ సృష్టించే సంకేతాలు కనపడుతున్నాయి.
ADVERTISEMENT



