పవన్ కళ్యాణ్ జేఏసీ టీడీపీ వ్యతిరేక జేఏసీ అవుతాదేమో?

Pawan-Kalyan---Jana-Sena-Latest-Press-Meetజనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టాకా మొట్టమొదటి సారి మీడియా ముందుకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడానికి ఒక జేఏసీ ఏర్పాటు చెయ్యాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జేపీ, ఉండవల్లి లాంటి మేధావులు దీనిలో ఉంది నడిపించాలని అందుకు వారిని కలవబోతున్నట్టు పవన్ చెప్పారు.

అయితే చంద్రబాబు అంటే వ్యక్తిగత కక్ష పెట్టుకుని తరచూ ప్రెస్ మీట్లు పెట్టే ఉండవల్లికి మేధావి హోదా ఇచ్చి జేఏసీ అంటే టీడీపీ స్పందిస్తుందా అనేది చూడాలి. ఉండవల్లి తన జీవితం మొత్తం తెలుగు దేశం, బీజేపీలకు వ్యతిరేకంగానే పోరాటం చేసారు ఇప్పుడు చేస్తూనే ఉన్నారు కూడా.

ADVERTISEMENT

ఉదాహరణకు ఒకానొక సందర్భంలో ఓటుకు నోటు కేసులో విషయం లేదని ఆయనే అన్నారు. ఈ మధ్య మాత్రం ఆ కేసు వల్లే ఆయన భయపడుతున్నారేమో అంటున్నారు. మరోవైపు లోక్ సత్తా జేపీ కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నా ఆయన విషయపరిజ్ఞానం అందరికి మర్యాద ఉంది.

దీనిబట్టి ఆయన జేఏసీ ప్రతిపాదన ఎలా ఉంటుందో చూడాలి మరి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కోసం ఈ నెల 21 నుంచీ న్యూఢిల్లీ లోని జంతర్ మంతర్ లో ఆమరణ నిరాహారదీక్ష పవన్ కళ్యాణ్ అమరణనిరాహార దీక్ష చేస్తున్నట్టు పుకార్లు షికారు చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వాటిని కొట్టిపారేశారు. అవి ఓటు బ్యాంకు రాజకీయాలు అని, వాటి వల్ల ఉపయోగం ఉండదని ఆయన అన్నారు.

ADVERTISEMENT
Latest Stories