బెదిరింపు బానే పని చేసినట్టుంది… ఆలోచనలో టాలీవుడ్ నిర్మాతలు

Producers Announced they wait until theaters openథియేటర్లలో కాకుండా ఓటీటీలలో తమ సినిమాలను విడుదల చెయ్యాలనే ప్లాన్లను విరమించుకోవాలని తెలుగు నిర్మాతలకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన అల్టిమేటం పని చేసినట్టుగా కనిపిస్తోంది. నారప్ప మరియు దృశ్యం 2 ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి సురేష్ బాబు ఇతర పార్టనర్స్ అలాగే ఒటిటి ప్లాట్‌ఫామ్‌లతో చర్చలు జరుపుతున్నట్లు ఛాంబర్‌కు తెలియజేసినట్లు సమాచారం.

అదే సమయంలో సందీప్ కిషన్ యొక్క గల్లీ రౌడీ నిరంతలు కూడా వెనక్కి తగ్గారు. ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ తో చివరి దశ చర్చల్లో ఉన్న వారు చివరి నిమిషంలో తమ ఆలోచనను విరమించుకున్నారు. థియేటర్లు తెరిచే వరకు వేచి ఉంటామని ప్రకటించారు. చిత్ర సీమలోని నిర్మాతలు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తీసుకుంటామని చెబుతున్న ‘గట్టి చర్యల’ గురించి ఆందోళన చెందుతున్నారట.

ADVERTISEMENT

దానితో వారు వారి ప్రణాళికలను విరమించుకుంటున్నారు. పైగా… ఇంకా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని థియేటర్లు ఎలాగూ ఆగస్టు మొదటి వారం నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి, తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేయాలని వారు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఓటీటీలతో చర్చలలో ఉన్న మరి కొందరు నిర్మాతలు కూడా అదే ఆలోచన చేస్తున్నారట.

ఇది ఇలా ఉండగా… అమెజాన్ ప్రైమ్ వీడియోతో చాలా కాలం క్రితమే ఓటీటీ ఒప్పందాన్ని లాక్ చేసిన నితిన్ యొక్క మాస్ట్రో విషయంలో ఏమి జరుగుతుందో మనం చూడాలి. మిగతా వారందరు చర్చల దశలోనే ఉన్నారు. మేస్ట్రో ఒక్కటే అగ్రిమెంట్ కూడా పూర్తి చేసుకుంది.

ADVERTISEMENT
Latest Stories