అనుకున్నదే జరిగింది. టి.డి.పి ఉహించినట్లే కాకినాడ కార్పోరేషన్ గెలవడానికి అవసరమైనా మ్యాజిక్ ఫిగర్ ను సొంతం చేసుకోంది. గెలిచిన అభ్యర్దులు ప్రజలు చంద్రబాబు గారి పాలనకే మొగ్గు చూపుతున్నారని మళ్ళి నిరూపించారని ముఖ్యమంత్రిగారి పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 30 సంవత్సరాల తరువాత కాకినాడలో సైకిల్ దూసుకుపోయింది. ఈ విజయంతో చంద్రబాబు తానేమిటో తన రాజకీయ అనుభవం ఏమిటో ప్రతిపక్ష నేతకు అర్ధం అయ్యేలా చెప్పారని ఒప్పుకోక తప్పదు.
నంద్యాలలో సానుభూతితో ఓట్లు రాబట్టారని చెప్పిన వై.సి.పి ఇప్పుడు ఏం సమాధానం చెపుతుందో ఆలోచించు కోవాలని టి.డి.పి నాయకులు వై.సి.పి కి కౌంటర్లు వేస్తున్నారు. మరి చూడాలి జగన్ ఈసారి కుడా ప్రజలను అవినీతి పరులుగా,డబ్బుకు అమ్ముడు పోయి ఓట్లు వేసినట్లుగా చిత్రీకరిస్తారో…. లేక మరో కొత్త సాకు చెపుతారో.
| S# | Party | Win |
|---|---|---|
| 1 | TDP | 32 |
| 2 | YSRCP | 10 |
| 3 | BJP | 3 | 3 | Others | 3 |
ప్రజలలో బాబు గారి పాలనా పట్ల బాగా వ్యతిరేఖత వచ్చింది ఇక ప్రజల కష్టాలు తీరే రోజులు వచ్చాయి ముందు రాబోయే కాలం అంత వై.సి.పి దే అని విరుచుకుపడ్డ ప్రతిపక్ష పార్టీకి ప్రజలే తమ ఓట్లతో సమాధానం చెప్పారని టి.డి.పి కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ముందు రాబోయే కాలంలో ప్రజల కష్టాల సంగతి సరి ముందు మీ పార్టీని కష్టాల నుండి గట్టేకిన్చుకోమని సెటైర్లు వై.సి.పి నాయకులపై పడుతున్నాయి.
ఇన్ని సంవత్సరాల తరువాత కార్పోరేషన్ పీట్టాన్ని దక్కించుకున్న అధికార టి.డి.పి అభివృద్ధితో ప్రజలను ఆకట్టుకొని, ఇచ్చిన హామీలు నేరవేర్చి ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలపెట్టుకోవాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.


