అప్పుడు అడిగి… ఇప్పుడు మొహం చాటేస్తున్నారు

Chiranjeevi - KCR- Trivikram Srinivas- Tollywoodతెలంగాణ ప్రభుత్వం వారం రోజుల క్రితం సినిమాలు మరియు టెలివిజన్ చిత్రీకరణకు అనుమతి ఇచ్చింది. తగు జాగ్రత్తలు తీసుకుని షూటింగులు చేసుకోండి అంది. అయితే, రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల గురించి మేకర్స్ ఆందోళన చెందుతున్నందున, రవిబాబు యొక్క క్రష్ సినిమా మినహా, మరే ఇతర చిత్రాలేవీ షూటింగ్ ప్రారంభించలేదు.

సీనియర్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి వారు వెంటనే షూటింగులను పునః ప్రారంభించే ఆలోచనలో లేరని నివేదికలు వస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టే వరకు సీనియర్ తారలందరూ వేచి చూస్తారని సమాచారం. నాగార్జున యొక్క వైల్డ్ డాగ్ సినిమాకు కేవలం పది రోజుల షూటింగ్ మిగిలి ఉంది.

ADVERTISEMENT

కాబట్టి నటుడు షూట్ ను ప్రారంభించి పూర్తి చేయవచ్చు అంటున్నారు. అది కూడా ఇప్పట్లో కాదని సమాచారం. ఆ సినిమా డైరెక్టుగా ఆన్ లైన్ లో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… షూటింగ్ అనుమతి కోసం తారలు ప్రభుత్వంతో లాబీయింగ్ చేసినప్పుడు, కేసులు తక్కువగా ఉన్నాయి.

కానీ, ఇప్పుడు కేసులు పెరిగాయి, దానితో ఇప్పుడు వారు షూట్ చెయ్యడానికి అనుమాన పడుతున్నారు. చిరంజీవి ఈ మీటింగులు అన్నిటికీ నాయకత్వం వహించారు. వెంకటేష్ అన్న గారు సురేష్ బాబు కూడా ప్రతీ మీటింగులో ఉన్నారు. అయితే ఇప్పుడు వారు కూడా వెనుకడుగు వెయ్యక తప్పలేదు.

ADVERTISEMENT
Latest Stories