ప్రశాసన్నగర్లోని జనసేన కార్యాలయంలో కాసేపటి క్రితం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. టీడీపీ బీజేపీ వాదనలలో ఏది నిజమో నిర్ధారించడానికి జేపీ, ఉండవల్లి న్యాయకత్వంలో ఒక కమిటీని వేస్తున్నట్టు ఉండవల్లి చెప్పారు. ఈ సంధర్భంగా ఇరు వైపులలో ఒకరు అబద్దం చెబుతున్నారని అది ఎవరో కనిపెట్టాలని పవన్ కళ్యాణ్ అన్నారు.
అయితే ఉండవల్లి సమాధానం కాస్తా భిన్నంగా ఉంది. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు బిజెపి,టిడిపిలలో ఎవరో ఒక అబద్దం ఆడుతున్నారన్న వాదన కరెక్టు అని,అయితే ప్రభుత్వాలు అబద్దాలు ఆడవని, కాని నిజాలు చెప్పవని ఉండవల్లి అరుణకుమార్ అన్నారు. ఉండవల్లి చెప్పినది చిన్న విషయమే అయినా అది దాదాపుగా రాజకీయ నిగూఢ రహస్యామనే అనాలి.
టీడీపీ బీజేపీ కలయిక వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని అప్పట్లో భావించినట్లు పవన్కల్యాణ్ చెప్పారు. అంతకుముందు జరిగిన అవకతవకలేమైనా ఉంటే అటు ప్రధానిగా నరేంద్రమోదీ ఇటు అనుభవమున్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటే చాలా మేలు జరుగుతుందని భావించి 2014లో మద్దతు ప్రకటించినట్లు చెప్పుకొచ్చారు.



