జగన్ ఓటమి భయంతో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?

We are ready for bypolls says ys jaganపదవులకు ఇంకా 14 నెలలు గడువున్నా రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో రాజీనామాలు చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు సెల్యూట్‌ చేస్తున్నాను అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. “ప్రత్యేక హోదా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు ఎలాంటి భయం లేకుండా రాజీనామాలు సమర్పించారు. అదే రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసివుంటే కేంద్రంపై ఆ ప్రభావం తీవ్రంగా ఉండేది. ఎంపీలతో రాజీనామాలు చేయించేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భయపడ్డారు,” అని ఆయన అన్నారు.

అయితే ఉపఎన్నికలు వస్తే ధైర్యంగా ఎదురుకుంటాం అని చెప్తూనే టీడీపీ పోటీ పెట్టకూడదు అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేసారు. “ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన వారు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే బుద్ధి ఉన్నా పార్టీ ఏదీ ప్రత్యర్థులుగా బరిలోకి నిలపదు. అలా అభ్యర్థులను పెడితే ప్రత్యేక హోదాకు వారు అనుకూలమా? లేక వ్యతిరేకమా? అనే ప్రశ్న వస్తుంది. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన స్థాన్నాల్లో సిగ్గుమాలిన తెలుగుదేశం పార్టీ పోటీకి దిగితే అది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అదృష్టంగా భావిస్తుంది. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే టీడీపీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కవు,” అని ఆయన చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

ఒకవేళ టీడీపీ నిజంగా పోటీ చేసి డిపాజిట్లు తెచుకోలేకపోతే అది జగన్ పార్టీ కే మంచిది కదా? మరి జగన్ ఎందుకు చంద్రబాబు పోటీ పెట్టకూడదని కోరుకుంటున్నారు? ఓటమి భయంతోనే ఇలాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారా? అయినా ఇవన్నీ ఉపఎన్నికలు జరిగినప్పుడు కదా? ఉపఎన్నికలు రాకుండా జాగ్రత్తపడేగా రాజీనామా చేసింది.

ADVERTISEMENT
Latest Stories