నవంబర్ 2 నుండి జగన్ అన్నొస్తున్నాడు పేరుతో 3500 కిలోమీటర్ల పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు అని గతంలోనే . చేశారు. ఐతే ఇప్పుడు ఆ డేట్ మరే అవకాశం కనిపిస్తుంది. పాదయాత్ర సందర్భంగా వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ జగన్ వేసిన పిటిషన్ను తోసిపుచ్చిన సీబీఐ ప్రత్యేకకోర్టు.
కేసుల తీవ్రత నేపధ్యంలో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు అయ్యీ సహకరించాల్సిందే అని తేల్చి చెప్పిన కోర్టు. మరో వైపు నవంబరు 10 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 10 రోజులపాటు సమావేశాలు నిర్వహించే యోచనలో సర్కార్. నవంబర్ 2న పాదయాత్ర మొదలు పెడితే మళ్లీ 3 శుక్రవారం కోర్టుకు వెళ్ళాలి.
అదే విధంగా ఒక వారం తరువాత అసెంబ్లీ సమావేశాలు పేరుతో మళ్లీ ఇంకో 10 రోజులు బ్రేక్ ఇవ్వాలి. అసలే అసెంబ్లీలో జగన్ అంత తానే అన్నట్టు వ్యవహరిస్తారు. కాబట్టే అసెంబ్లీ సమావేశాలు అయ్యే వరకు పాదయాత్ర పొస్ట్పోన్ చేస్తే బెటర్ ఏమో అని పార్టీలో చర్చ జరుగుతుంది.
6 నెలల పాటు 3600 కిలోమీటర్ల దూరం నడవాలని ఆయన ప్రణాళిక. ఈ ప్రక్రియలో ఆయన 120 నియోజకవర్గాలను కవర్ చెయ్యబోతున్నారు. ఈ పాదయాత్ర ఆయనను ముఖ్యమంత్రి సింహాసనంలో కూర్చోబెడుతుందని ఆయన నమ్మకం. ఐతే ఆదిలోనే హాంసపాధులు ఎదురవ్వడం తో ఆ పార్టీ శ్రేణులు ఒకింత నిరాశకు గురి అవుతున్నాయి.


