కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలలో వై.సి.పి పార్టీ మొత్తం 48 స్థానాలలో పోటీ చేస్తే 10 స్థానాలలో విజయం సాధించింది. గెలుపు ను వెనకేసున్న ఈ 10 స్థానాలలో జగన్ ప్రజలకు ఎన్ని నోట్లు ఇచ్చారో….., ఎన్ని కోట్లు కుమ్మరించారో చెప్పాలని టి.డి.పి. కార్యకర్తలు వై.సి.పి అధినేత జగన్ ను సూట్టిగా ప్రశ్నిస్తున్నారు.
నంద్యాలలో టి.డి.పి విజయం సాధిoచినప్పుడు ఆ విజయం చంద్రబాబు విజయం కాదు అని ప్రజలను డబ్బుతో కొట్టారని ఓటుకు నోట్లు ఇచ్చారని…, అధికార దుర్వినియోగం జరిగిందని ప్రభుత్వం మీద విరుచుకుపడిన జగన్ ఇప్పుడు ప్రజలకే కాదు ప్రభుత్వానికి సమాధానం చెప్పవలసిన సమయం వచ్చిందని టి.డి.పి శ్రేణులు జగన్ పై ప్రశ్నల వర్షం కురిపించే సమయం ఆసన్నమైందనే చెప్పాలి.
మరి వీటికి సమాధానం పార్టీ అధినేత అయినా జగన్ చెపుతారో లేక మీడియా కనపడగానే ప్రభుత్వo పై విరుచుకుపడే రోజా చేపుతారో ముందే ప్రణాళిక వేసుకోవాలేనే చురకలు వై.సి.పి నేతలకు చాలా ఘాటుగా తగులుతాయనడానికి ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వం అధికార దుర్వినియం చేస్తే ప్రతిపక్ష పార్టీ ఈ 8 స్థానాలలో ఏలా గెలుపుని సాధించిందో అన్న సంగతి ప్రభుత్వ అధికారులకు జగన్ తెలియ చేయాలి.
అంటే ఆంద్ర ప్రదేశ్ లో ఉన్న ప్రజలలో వై.సి.పి గెలిచినా చోట మాత్రమే ఎన్నికలు సజావుగా జరినట్లు ,ఆ పార్టీకి ఓటు వేసిన వారు మాత్రమే డబ్బుకి అమ్ముడు పోనట్లు, అక్కడ మాత్రమే అధికార దుర్వినియోగం జగలేదన్న చందంగా జగన్ వ్యాఖలు ఉన్నాయని రాష్ట్ర ప్రజలు భావిoచ్చాల్సి వస్తుంది.
తమ పార్టీ నాయకులూ గెలిస్తే ఒక రకంగా మరో పార్టీ నాయకులూ గెలిస్తే మరో రకంగా స్పందించే నాయకులను ప్రజలు ఎలా నమ్మాలో వారే ఆలోచాయించుకోవాలి. జగన్ తన ఉనికి కోల్పోతారనే అపనమ్మకo వచ్చినప్పుడల్లా ఆయన ప్రభుత్వంతో పాటుగా ప్రభుత్వ అధికారులను..అంతేకాక చివరికి ప్రజలను కూడా దోషులుగా చూపుతారని నిరూపించుకున్నారు. ఇంతకీ చివరికి ఈ 8 స్థానాల విజయo కష్టపడి పొందిందో లేక నోట్ల పెట్టి కొనిందో కాస్త చెపుతారా సారూ..!


