కృష్ణజింకలను వేటాడిన కేసులో రాజస్థాన్లోని జోధ్పూర్ న్యాయస్థానం సల్మాన్ ఖాన్కు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. 1998 అక్టోబర్లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రీకరణ సమయంలో సల్మాన్ కృష్ణజింకలను వేటాడారు. సుమారుగా 20 ఏళ్ళ తరువాత ఈ కేసులో తీర్పు వచ్చింది. రూల్ ప్రకారం మూడేళ్ళ కంటే ఎక్కువ జైలు పడిన కేసులలో బెయిల్ రావడం కుదరదు.
సల్మాన్ ఖాన్ జైలుకు వెళ్ళి ఈ కేసును పై కోర్టులో అప్పీలు చేసుకోవాలి. అయితే గతంలో ఇలాంటి సందర్భంలో అప్పటికప్పుడు పై కోర్టుకు వెళ్ళి కింద కోర్టు శిక్షను కొట్టించేసుకుని జైలుకు వెళ్లడం తప్పించుకున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యబోతున్నాడో చూడాలి మరి. సల్మాన్కు శిక్ష ఖరారు కావడంతో ఆయన తర్వాతి ప్రాజెక్టులపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టుల విలువ రూ.1000 కోట్లు అని సినీ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సల్మాన్ ‘భారత్’, ‘రేస్ 3’, ‘కిక్ 2’, ‘దబాంగ్’ చిత్రాల్లో నటిస్తున్నారు. కాబట్టి ఆ ప్రోజెక్టుల నిర్మాతలు కూడా తమ వంతు ప్రయత్నంగా ప్రభుత్వాలపై ఒత్తిడి చేసే పనిలో ఉంటాయి. దేశంలో సినిమా స్టార్లుగా ఉన్నందుకు ఆ మాత్రం వెసులుబాట్లు ఉంటాయి మరి.



