ఆంద్రప్రదేశ శాసనసభ భవనం నిర్మాణం నిమిత్తం పదమూడు రకాల డిజైన్ లను నార్మన్ పోస్టర్ సంస్థ ప్రతిపాదించింది.వాటిని ప్రజల అబిప్రాయాల నిమిత్తం బుధవారం సోషల్ మీడియాలో పెట్టారు. పరిపాలన నగరం డిజైన్ తో పాటు అసెంబ్లీ, సచివాలయం,హైకోర్టు నమూనాలను కూడా ఈ సంస్థ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.
గత కొంతకాలంగా ఈ సంస్థ రూపొందించిన ఈ డిజైన్ లను చంద్రబాబు అంగీకరించలేదు.చివరికి ప్రముఖ ధర్శకుడు రాజమౌళిని లండన్ పంపి ఆయన అభిప్రాయం కూడా తీసుకున్నారు. .ఆ తర్వాత వీటిని విడుదల చేశారు.కాగా ఈ పదమూడు డిజైన్ లలో గతంలో ఇచ్చిన మూడు కూడా ఉన్నాయి.
ఐతే ఈ కొత్త డిజైన్లు కూడా మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా లేవని సోషల్ మీడియాలో విస్తృత అభిప్రాయం. గతంలో లాగే వీటికి కూడా ఫారెన్ వాసనలు వస్తున్నాయని వారి అభిప్రాయం. ఈ నెలాఖరున ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ వెళ్ళి నార్మన్ పోస్టర్ సంస్థ ఆఫీస్కు వెళ్తారు. తుది నిర్ణయం అప్పుడే జరగొచ్చు.


