ఏపీ సచివాలయం స్వరూపం రిలీజ్ – టాక్ అదిరింది!

andhra pradesh state secretariate entranceజూన్ నాటికల్లా సిద్ధం కానున్న ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం స్వరూప చిత్రాలకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది. వీటిలో శాసనసభ, శాసనమండలి భవనాల నిర్మాణ నమూనాలు చూడ్డానికి అద్భుతంగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నిర్మాణాలను శాశ్వతంగా వినియోగించుకునేలా డిజైన్ చేసినట్లు స్పష్టమవుతోంది.

వెలగపూడిలో నిర్మాణం కానున్న ఈ సచివాలయాన్ని ప్రముఖ అగ్రగామి కంపెనీలు ఎల్ అండ్ టీ, షాపూర్ జీ పల్లోంజీ చేపట్టాయి. ఇటీవలే ప్రారంభం అయిన ఈ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం కోరినట్టుగా జూన్ లోపే నిర్మాణాలను పూర్తి చేసి ఇస్తామని నిర్మాణ కంపెనీలు పేర్కొన్నాయి. దీంతో జూన్ నుంచి తాత్కాలిక సచివాలయంలోనే అసెంబ్లీ సమావేశాలతో పాటు పరిపాలన కొనసాగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories