ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏం ఇచ్చామన్నది వివరంగా చెప్తాను… ఆంధ్రప్రదేశ్ మిత్రులు కాస్త సంయమనంతో ఉండాలని ప్రారంభించిన ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మళ్ళీ పాత పల్లవినే కొత్తగా ఆలపించి, ఏపీ ప్రజల సహనాన్ని పరీక్షించారు.
ఏపీకి పలు జాతీయ సంస్థలను కేటాయించామని వాటికి నిధులు ఇస్తున్నామని, అలాగే ఏపీ రాజధాని నిర్మాణానికి, వెనుకబడిన జిల్లాలకు కూడా కొన్ని నిధులు ఇచ్చామని, ఇవన్నీ కాక పోలవరానికి పలుసార్లు నిధులు ఇచ్చామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ అధికారులు నిన్నటి నుంచి చర్చలు కూడా జరుపుతున్నారని, రైల్వే జోన్ కు సంబంధించి కొన్ని విషయాలు తేలాల్సి ఉందని అన్నారు. రెవెన్యూ లోటుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ఏపీకి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని అదే పాటను పాడారు.
అప్పట్లో తాము రాష్ట్ర విభజనకు మద్దతిచ్చినప్పటికీ, ఏపీకి హక్కుల కోసం కూడా అప్పట్లో పోరాడామని అరుణ్ జైట్లీ చేస్తున్న ప్రసంగంతో లోక్సభలో మరింత గందరగోళం చెలరేగడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు.



